Site icon Mana Prajapaksham

విశాఖపట్నం – హైదరాబాద్ విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్, మన ప్రజాపక్షం : విశాఖపట్నం-హైదరాబాద్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు మధ్యాహ్నం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. విమానం కొంత దూరం ప్రయాణించిన తర్వాత, రెక్కలో పక్షి ఇరుక్కోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రోటార్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి.అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విశాఖపట్నంలో నిలిచిపోయిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఎయిరిండియా యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.

Exit mobile version