విద్యతోనే ఉత్తమ భవిష్యత్

జనగామ, మన ప్రజాపక్షం: జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలోని మాడల్ స్కూల్ ను ఇంచార్జ్ కలెక్టర్, డీఈఓ పింకేష్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ లైబ్రరీ ని సందర్శించి బుక్స్ ను పరిశీలించారు. ఏ విధమైన పుస్తకాలు ఇష్టం అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలోని పుస్తకాలు సెలవుల్లో పిల్లలకు ఇచ్చి, సెలవుల తరువాత బుక్ రివ్యూ చేయించాలని సూచించారు. అటల్ టింకరింగ్ లాబ్ ను సందర్శించి ఇన్నోవాటివ్ ఆక్టివేటీస్ ని పరిశీలించి, 8 ఉత్తమ ఇన్నోవే షన్స్ వీడియోలను తయారు చేసి పంపవలసింది గా ఆదేశించారు. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టీకల్స్ జరిగే విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎస్సెస్సి, ఇంటర్ స్టూడెంట్స్ ను దత్తత తీసుకుని 100% ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సత్యమూర్తి, ఏఎంఓ శ్రీనివాస్, జిసీడీఓ గౌసియా బేగం, మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *