నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : రాష్ట్రంలో కోనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాల కలెక్టర్లు, జాతీయ రహదారుల, రెవెన్యూ అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణాల పురోగతి కోసం కావాలని భూ సేకరణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తూ ఎన్హెచ్ 167 కే జాతీయ రహదారి 79.3 కిలోమీటర్ల మేర నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి కోల్లపూర్ సోమశిల వరకు 106.7 హెక్టార్ల విస్తీర్ణం భూమి అవసరం కాగా ఇప్పటివరకు 77.5 హెక్టార్ల విస్తీర్ణం భూ సేకరణ పూర్తి అయిందని, మిగిలిన 29.2 హెక్టార్ల విస్తీర్ణం భూ సేకరణ పనులను అక్టోబర్ 15 వ తేదీ వరకు భూ సేకరణ పనులను పూర్తిచేసి జాతీయ రహదారుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ మండల పరిధిలోని మూడు గ్రామాల పరిధిలోని భూ సేకరణ పనులను పూర్తి చేస్తామని కల్వకుర్తి మండల పరిధిలో ఉన్న కోర్టు కేసులను పరిగణనలోకి తీసుకొని వేగవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో మిగిలిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్ నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ఆర్డీవోలు సురేష్, బన్సీలాల్, జనార్దన్ రెడ్డి, నేషనల్ హైవే డిఈ రమేష్ బాబు, కలెక్టరేట్ భూ సేకరణ విభాగం సూపరిండెంట్ నారాయణ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి నిర్మాణ పనులకు భూ సేకరణను పూర్తి చేస్తాం



