పశువులకు సకాలంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :నారాయణపేట జిల్లాలోని అన్ని గ్రామాలలో నిర్ణీత షెడ్యూలు ప్రకారం పశువులకు సకాలంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాహర్ పేటలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. పశువులకు వేసే టీకాల కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం ఇటీవలే ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించిందని, ఆ పథకం కింద రాష్ట్రంలోనీ నాలుగు జిల్లాలు జనగామా,నాగర్ కర్నూల్, గద్వాలతో పాటు నారాయణపేట జిల్లాను కూడా ఎంపిక చేసిందని గుర్తు చేశారు. అయితే ఆ పథకంలో వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు పశుసంవర్ధక, డైరీ, ఫిషరీస్, 11 అనుబంధ శాఖలలోని పారా మీటర్స్ ల అభివృద్ధి చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. దాదాపు లక్ష టీకాల డోసులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువులకు టీకాలు వేయించాలని కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పశువైద్యాధికారి, అనిరుద్ చారి, తదితరులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *